Thursday, February 13, 2020

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్విట్టర్ రివ్యూ: బ్లాక్ బస్టర్ ఫస్టాఫ్!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక తన స్టైల్లో విజయ్ దేవరకొండ నిర్వహించిన ప్రమోషన్స్ సినిమాపై విపరీతమైన బజ్, హైప్‌ను క్రియేట్ చేశాయి. వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుకింగ్స్ అదుర్స్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా టిక్కెట్ ధరలు పెంచినప్పటికీ బుకింగ్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఓపెనింగ్ డే అన్ని ఏరియాల్లో థియేటర్లు నిండిపోతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఆల్‌మోస్ట్ థియేటర్లు ఫుల్ అయిపోయాయి. ఒక్క హైదరాబాద్‌లోనే తొలిరోజు సుమారు 500 షోలు పడుతుండగా ఇప్పటికే 400కు పైగా షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీన్ని బట్టి విజయ్ దేవరకొండ సినిమాలకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూఎస్ రిపోర్ట్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూస్తున్న వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి ఫస్టాఫ్‌పై మిక్స్‌డ్ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఫస్టాఫ్ అదిరిపోయిందని కొంతమంది అంటుంటే.. పర్వాలేదు అని మరికొందరు అంటున్నారు. విజయ్ దేవరకొండ తన నటనతో కట్టిపడేశారట. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా చేశారని కొనియాడుతున్నారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఫస్టాఫ్ పర్ఫెక్ట్ బేస్‌ను ఏర్పరిచారట. ఇక సెకండాఫ్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి అని అంటున్నారు. అయితే, కథలో కథ అనే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టమనే వాదన వినిపిస్తోంది. క్యారెక్టర్ల డిజైన్ బాగుంది కానీ దాన్ని థియేటర్‌ల ప్రేక్షకుడు ఎంత వరకు అర్థం చేసుకుంటాడు అనేది చెప్పడం కష్టమే అంటున్నారు. మొత్తం మీద సినిమా అయితే బాగుంది కానీ మరీ ఎంజాయ్ చేసేంతగా లేదంటుని ట్వీట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్‌పైనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గౌతమ్, యామిని సీన్స్ ఫస్టాఫ్‌కు బలం అంటున్నారు. చూద్దాం సెకండాఫ్ తరవాత సినిమా టాక్ ఎలా ఉంటుందో. కథ సాగుతోంది ఇలా.. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో సినిమా మొదలవుతుందట. గౌతమ్‌ను జైల్లో చితక్కొడుతున్న సీన్‌తో మూవీ ఓపెన్ అవుతుంది. యామిని (రాశీ ఖన్నా)తో లవ్ స్టోరీ మొదట చూపించారట. ఆమెతో గౌతమ్ లివింగ్ రిలేషన్‌షిప్, బ్రేకప్ సీన్స్ బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా రాశీ ఖన్నా నటన అద్భుతమంటున్నారు. ఇక అక్కడి నుంచి స్టోరీ ఎల్లందు బొగ్గు గనులకు షిఫ్ట్ అవుతుందట. అయితే, స్టోరీ అక్కడి ఎలా షిఫ్ట్ అయ్యింది అనే విషయంలో చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఇక అక్కడ సీనయ్యగా విజయ్ దేవరకొండ కనిపిస్తారు. అప్పటికే సువర్ణ (ఐశ్వర్య రాజేష్)తో పెళ్లయి పిల్లాడు ఉన్న సీనయ్య.. కోల్ మైన్ వెల్ఫేర్ ఆఫీసర్ స్మిత (కేథరిన్)తో ప్రేమలో పడతాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39rPR7k

No comments:

Post a Comment

ChatGPT or Super Bowl? OpenAI premium ads could cost as much as a prime NFL TV slot - but which is better value?

OpenAI is launching ChatGPT ads with NFL-level pricing, offering impression data only, raising questions about engagement and advertising va...