Tuesday, June 9, 2020

మరో బాంబ్ పేల్చిన బాలయ్య.. జగన్‌తో మీటింగ్‌కి నేను రానని చెప్పిందెవరు?

మంగళవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, సి. కళ్యాణ్, దిల్ రాజు, రాజమౌళి తదితరులు హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జగన్‌తో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం నుంచి సానుకూలమైన హామీలు రావడంతో ఆనందం వ్యక్తం చేసింది చిరంజీవి బృందం. అయితే గత కొన్నిరోజులుగా వీరి బృంద చర్చలపై విమర్శులు గుప్పిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. మీడియా అడిగింది కాబట్టే నేను చెప్పా అంటూనే తెలంగాణ ప్రభుత్వంతో చిరు బృందం జరిపిన చర్చల్ని ఆస్తులు పంచుకోవాడానికే అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు బాలయ్య. అయితే ఆయన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపగా.. బాలయ్యను ఈ చర్చలకు పిలవకపోవడం వల్లే వివాదం అని గ్రహించిన ఇండస్ట్రీ పెద్దలు నిన్న (జూన్ 10) ఏపీ సీఎం జగన్‌తో జరిగిన చర్చలకు బాలయ్యకు ఆహ్వానం అందించారు.

నిర్మాత సీ కళ్యాణ్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. బాలయ్యను జగన్‌తో జరిగే చర్చలకు పిలిచామని అయితే ఆయన పుట్టినరోజు ఉండటంతో రానని మీరు మాట్లాడిరండని చెప్పారంటూ మీడియా ముందే పలికాలు. దీంతో అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన చర్చలకు తనను పిలవలేదని రచ్చ చేసిన బాలయ్య.. ఇప్పుడు జగన్‌తో చర్చలకు రానని చెప్పడాన్ని తప్పుపడ్డారు. అయితే ఇష్యూపై క్లారిటీ ఇస్తూ సంచలన కామెంట్స్ చేశారు నందమూరి బాలకృష్ణ. అసలు జగన్‌తో జరిగే చర్చలను నేను రాను అని చెప్పలేదంటూ వాళ్లకు వాళ్లే అన్ని నిర్ణయాలు తీసుకుని దాన్ని నాపై రుద్దుతున్నారంటూ జరిగిన విషయాన్ని తెలియజేశారు బాలయ్య.

బాలయ్య మాట్లాడుతూ.. ముందుగా ఇండస్ట్రీ కోసం సీఎంని కలుస్తున్నాం అంటే.. ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి అపాయింట్‌మెంట్ ఇచ్చామని చెప్పాలి. అంతేతప్ప ఒక పర్శన్‌కి అపాయింట్‌మెంట్ అనకూడదు. (జగన్‌తో భేటీకి చిరంజీవి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు). ఇండస్ట్రీ ఒక వ్యక్తికి సంబంధించిన కాదు. ఇది నా అభిప్రాయం. ఏపీ సీఎంని కలుస్తారని నాకూ తెలిసింది. అయితే అది నా పేరుతో రాలేదు. కాని ప్రభుత్వం అపాయింట్‌మెంట్ ఇచ్చింది ఒక వ్యక్తికి అని తెలిసింది. అందులో అతని కూడా ఎవరెవర్ని తీసుకుని రావాలో రాసిపెట్టి ఉంది.

అది కరెక్ట్ కాదు కదా.. సినిమా ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఛాంబర్‌కి అధికారం ఉంటుంది. వాళ్లు చెప్తారు ఎవరెవరువెళ్లాలో ఏంటో. అంతేకాని ఒక వ్యక్తి నిర్ణయిస్తే మంచి కాదని నేను హర్ట్ అయ్యా. దీంతో వాళ్లు నన్ను సంప్రదించడంతో సీఎంను కలవాలా? లేదా అన్నదానిపై నేను ఆలోచిస్తా అని చెప్పా. ఈలోపు వాళ్లే అనౌన్స్ చేశారు.. బాలకృష్ణ బర్త్ సందర్బంగా ఆయన రానన్నారని వాళ్లే చెప్పేశారు. నాకు తెలియకుండా.. నా విషయం నాకు సంబంధం లేకుండా స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అది నా నిర్ణయం అయితే నేను చెప్పాలి కాని.. వీళ్లు ఎవరు చెప్పడానికి? నా తరుపున మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఆ ప్రకటన తరువాత వాళ్లు నన్ను ప్రయత్నించినా నేను స్పందించలేదు.

మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే స్టుడియో కోసం నేను అప్లైచేశా. ఇప్పటికీ నా అప్లికేషన్ అలా పడిఉంది. ఇండస్ట్రీని డెవలెప్ చేయాలని స్టుడియో నిర్మించాలని అప్లికేషన్ పెట్టిన మొదటి వ్యక్తిని నేను. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వీళ్లు ఎవరైనా ముందుకు వచ్చారా?? అసలు ఇండస్ట్రీ గురించి ఎవరైనా మాట్లాడారా? నేను మాట్లాడి నంది అవార్డులు ఇతర కార్యక్రమాలు చేసింది నేను. అప్పుడైనా ఇప్పుడైనా ఇండస్ట్రీ గురించి కాస్తో కూస్తో ఆలోచించి ఏదైనా చేసింది అంటే అది నేనే. ఇప్పుడు ఏదో చర్చలు చేస్తున్నారు కాని వీటిని నేను ఎప్పుడో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లా.

సినిమా ఇండస్ట్రీ రాజకీయ రంగు పులుముకోవడం కాదు.. అది మొదటి నుంచి ఉంది. నన్ను ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా టీడీపీ ప్రతినిధిగా చూస్తున్నారనేది వాస్తవం. నిజానికి సినిమా ఇండస్ట్రీ రాజకీయాలకు అతీతం. ఎందుకంటే నాకూ ఓ హిస్టరీ ఉంది. బ్యాగ్రౌండ్ ఉంది. నేను ఎప్పుడూ ఎవర్నీ హర్ట్ చేయను.. నా ఆత్మగౌరవాన్ని హర్ట్ చేస్తే సహించను. ఇండస్ట్రీలో గ్రూపులు ఎక్కువైపోయాయి. కులాల రంగులు పూయడం ఎక్కువైపోయింది’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు నందమూరి బాలకృష్ణ.

Read Also:

బాలయ్య బర్త్ డే స్పెషల్.. ఎన్టీఆర్ వారసత్వాన్ని తొడకొట్టి నిలబెట్టడం బాలయ్యకు ఈజీనా?



from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MHDyKX

No comments:

Post a Comment

Still using WinRAR? You should probably look out for these potentially dangerous security flaws

A high severity flaw in WinRAR allows crooks to execute malware remotely. from Latest from TechRadar https://ift.tt/IqEs6P7