ఈ ఏడాది సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు సినీ లోకంలో కరోనా కలకలం సృష్టిస్తుండగా.. మరోవైపు సినీ ప్రముఖుల వరుస మరణాలతో యావత్ సినీ వర్గాల్లో విషాదాలు అలుముకుంటున్నాయి. నిన్న (శుక్రవారం) రాత్రి కన్నడ చిత్ర సీమలో రాజ్కుమార్, విష్ణు వర్ధన్ వంటి అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన సీనియర్ డైరెక్టర్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గంధద గుడి, మయూర, శ్రీనివాస కళ్యాణ, భక్త ప్రహ్లాద, సనాది అప్పణ్ణ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన విజయ్ రెడ్డి.. కన్నడ భాషలో 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజ్కుమార్, విష్ణువర్ధన్లతో ఆయన తెరకెక్కించిన ‘గంధద గుడి’ సినిమాను ఎన్టీఆర్ హీరోగా ‘అడవి రాముడు’గా కె.రాఘవేంద్ర రావు తెలుగులో రీమేక్ చేశారు. విజయ్ రెడ్డి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై రాజ్ కుమార్ కుమారుడు పునీత్ రాజ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తన తండ్రి రాజ్కుమార్తో ఉన్న విజయ్ రెడ్డి ఫోటోను షేర్ చేశాడు. తన తండ్రితో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయ్ రెడ్డి మరణం తమ కుటుంబాన్ని కలచి వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jPEziT
No comments:
Post a Comment