అతి తక్కువ సినిమాలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది . భరత్ అనే నేను, వినయ విధేయ రామ.. చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన మనసుకు నచ్చితే ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పడం ఆమె నైజం. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కియారా హైస్కూల్ రోజుల్లోని తన ప్రేమాయణం గురించి బయటపెట్టి అందరినీ షాక్కు గురిచేసింది. ‘ప్లస్ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో వాళ్లకి ఏదొక అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. దీంతో చదువును అశ్రద్ధ చేస్తున్నానని నా పేరెంట్స్ కోప్పడేవారు. అప్పుడు చదువా? ప్రేమా? అన్న సంఘర్షణ పడి చివరికి ప్రేమను త్యాగం చేశారు. ఆ టైమ్లో మానసికంగా చాలా సంఘర్షణ పడ్డాను. కానీ వయసు పరిపక్వతతో త్వరగానే కోలుకున్నానని కియారా చెప్పారు. Also Read: కియారా ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా మారింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సుందరి మోడ్రన్ డ్రెస్లతో సంప్రదాయ దుస్తుల్లోనూ ఫొటో షూట్స్ చేస్తూ ఈ ఫోటోలను తరుచూ సోషల్మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. కియారా ‘లక్ష్మీ బాంబ్’ ‘ఇందూ కి జవానీ షేర్ షా’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “బుల్ భులయ్యా 2” మూవీ షూటింగ్ దశలో ఉంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35mzqc3
No comments:
Post a Comment