స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. లాక్డౌన్ విరామం ముగియడంతో ఇటీవలే షూటింగ్ మొదలైంది. బన్నీతో సహా ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ స్మగ్లర్గా కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మందానా తొలిసారి జత కడుతోంది. ఈ సినిమాకు సంబంధించి విలన్ కోసం యూనిట్ కొద్దిరోజులుగా జల్లెడ పడుతోంది. ముందుగా విజయ్ సేతుపతి అనుకున్నా.. డేట్స్ అడ్జట్స్ కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. Also Read: పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో బాలీవుడ్ నటుడు విలన్గా అయితే బాగుంటుందని సుకుమార్ అనుకుంటున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం విలన్ రోల్ కోసం తమిళ నటుడు ఆర్యతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్తే నిజమైతే బన్నీ-ఆర్య కాంబోను ప్రేక్షకులు మరోసారి చూడనున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వరుడు’ సినిమాలో బన్నీ హీరోగా, ఆర్య విలన్గా కనిపించారు. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయినా వీరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షలకును బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాలో ఆర్య విలన్గా నటింపజేస్తే మరింత హైప్ వస్తుందని ‘పుష్ప’ యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nnMWDR
No comments:
Post a Comment