Saturday, September 12, 2020

ఆ డైరెక్టర్ రూమ్‌కి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడు.. హీరోయిన్స్ ఇలాగే ఎంజాయ్ చేస్తారంటూ! పాయల్ సెన్సేషన్

ఓ వైపు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న డ్రగ్స్ ఇష్యూ మరోవైపు సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలను సైతం వణికిస్తోంది. సూసైడ్ కేసు విచారణలో భాగంగా ఇష్యూ తెరపైకి వచ్చి సంచలనంగా మారింది. సుశాంత్ ప్రేయసి రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు అదుపులోకి విచారిస్తున్న క్రమంలో ఆమె 25 మంది సెలబ్రిటీల పేర్లు బయటపెట్టిందని తెలుస్తుండటం యావత్ సినీ లోకంలో వణుకు పుట్టించింది. సరిగ్గా ఈ తరుణంలో అదే డ్రగ్స్ ఇష్యూ గురించి స్పందిస్తూ ఓ మీడియా సంస్థకు సంచలన విషయాలు చెప్పింది హీరోయిన్ . ఈ వీడియోలో పాయల్ ఘోష్ మాట్లాడుతూ.. తనకు సుశాంత్ కొన్ని సంవత్సరాలుగా తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతూ ఓపెన్ అయింది. ''నేను ఓ డైరెక్టర్‌ని కలిశాను. అప్పుడు ఆయన ఈఆర్డీ రోడ్డులో నివసిస్తున్నాడు. నన్ను బాగా గారాబం చేసేవాడు. తర్వాత నన్ను ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడు. నేను ఏ హీరోయిన్‌ని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుందని చెప్పాడు. కానీ నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నా. ఇప్పటిదాకా మళ్ళీ అతడిని కలవలేదు. నాకు బాలీవుడ్‌లో మరే డైరెక్టర్‌తో ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు'' అని చెప్పింది పాయల్. Also Read: తాను గతంలో ఓ ఇండియన్ క్రికెటర్‌తో డేటింగ్ చేసి బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని పాయల్ ఘోష్ తెలిపింది. ఒక దశలో చనిపోతానని అనుకున్న తాను సుదీర్ఘ చికిత్స తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడ్డానని చెప్పింది. తనకు తెలిసినంత వరకు చాలామంది డ్రగ్స్ తీసుకుంటారని చెప్పిన ఆమె.. డ్రగ్స్ వాడితే యాక్టివ్‌గా ఉంటారనేదే వారి ఫీలింగ్ అని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల అభిమానులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె చెప్పింది. ఇక డ్రగ్స్ కేసులో రకుల్, సారా అలీఖాన్ పేర్లు బయటకు రావడంపై స్పందించిన పాయల్ ఘోష్.. సారా చాలా మంచి అమ్మాయని తెలిపింది. ఆమె పార్టీలో పాల్గొని ఉండవచ్చు గానీ ఆ పార్టీలో ఏం జరిగిందనేది తనకు తెలియదని చెప్పింది. కొన్నిసార్లు చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి కూడా కొందరు స్టార్స్ డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారని, అలా అని వారంతా డ్రగ్స్ బానిసలు కాదని పాయల్ తెలిపింది. ఇక సుశాంత్‌తో కలసి తాను జిమ్‌కి వెళ్లేదాన్నని, అతను సూసైడ్ చేసుకున్నాడంటే తాను నమ్మడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తంగా చూస్తే ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ తీవ్ర కలకలం సృష్టిస్తోందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు చిత్రసీమకు 'ప్రయాణం' సినిమాతో పరిచయమైన పాయల్ ఘోష్.. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో నటించింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో సరైన గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RnsiWc

No comments:

Post a Comment

SpaceX has applied to launch another million satellites into orbit – all to power AI

SpaceX wants to use a satellite network to ease the pressure on current data centers placed on terra firma. from Latest from TechRadar htt...