Tuesday, November 10, 2020

‘రాధేశ్యామ్’ షాకింగ్ అప్‌డేట్... క్లైమాక్స్ కోసం రూ.30కోట్లతో సెట్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘’. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న యూనిట్ ఇండియాకి తిరిగొచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో క్లైమాక్స్‌కు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా రూ.30కోట్ల ఖర్చుతో ఓ సెట్ వేయనున్నట్లు సమాచారం. హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కి వర్క్‌ చేస్తున్నారు. Also Read: ఆయన పర్యవేక్షణలోనే ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. యూరోప్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో క్లైమాక్స్‌ భారీ స్థాయిలో చిత్రీకరించాలని దర్శకుడు రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఆఖరి పోరాట సన్నివేశాల కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తుండటం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35nI9MB

No comments:

Post a Comment

Apple's UI executive poached by Meta, and three other executives leave in Apple AI exodus

The number of Apple execs leaving the company continues to rise, but most are being replaced. from Latest from TechRadar https://ift.tt/dB...