Saturday, November 7, 2020

అలా నిర్ణయం తీసుకునే అన్నీ బయటపెట్టా.. ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై ఆశ అంటూ పాయల్ మరో సెన్సేషన్

లాక్‌డౌన్ వేళ హీరోయిన్ నిత్యం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌‌పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన ఈమె.. ఈ ఇష్యూలోకి హీరోయిన్ రిచా చద్దాను కూడా లాగి రచ్చ చేసింది. అనురాగ్ కశ్యప్‌తో ఆమె సన్నిహితంగా ఉందని పాయల్ ఆరోపించడం, ఆ తర్వాత పాయల్‌పై రిచా కోర్టులో పరువు నష్టం దావా వేయడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మాఫియా గ్యాంగ్‌ తనని చంపేయాలని చూస్తోందని ప్రధానికి సైతం ఫిర్యాదు చేసిన ఆమె.. తాజాగా మరోసారి , అమిత్‌ షాలతో పాటు ముంబై పోలీసులకు ఓ మెసేజ్ పెట్టింది. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో మొత్తం నాలుగు సినిమాలకు సైన్‌ చేశానని చెప్పిన పాయల్.. అందులో హాలీవుడ్‌ సినిమా కూడా ఉందని తెలిపింది. షూటింగ్స్ స్టార్ట్ అయ్యి తిరిగి సెట్స్ మీదకు వచ్చే లోపు.. గత నాలుగేళ్లుగా తనని ఎంతగానో వేధిస్తున్న ఘటనను బయటపెట్టాలనే నిర్ణయం తీసుకునే లైంగిక వేధింపుల తాలూకు అన్ని విషయాలు చెప్పేశానని పేర్కొంది. ఇక ఇప్పుడు ఆ విషయాలను పక్కనెట్టి తన పని తాను చేసుకోవడానికి రెడీ అవుతున్నానని తెలిపిన ఆమె, ఇన్నాళ్లుగా తనని వేధిస్తున్న ఘటన విషయంలో ప్రధాని మోదీ, , ముంబై పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ట్వీట్ చేసింది. ''నాకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి తన ఇంటికి పిలిపించుకుని నిందితుడు నన్ను వేధింపులకు గురి చేశాడని పేర్కొంటూ సెప్టెంబర్ 22వ తేదీన ముంబై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటీకీ ఈ కేసు ముందుకు వెళ్లడం లేదు. నిందితుడు ప్రముఖ వ్యక్తి కావడంతో పోలీసులు అతని జోలికి వెళ్లడం లేదు. బాధితురాలినైన నేను న్యాయం కోసం అందరి తలుపులూ తడుతున్నాను. ఈ కేసులో జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నా'' అని గతంలోనే రాష్ట్రపతిని, ప్రధానిని అభ్యర్థించిన పాయల్ మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మోదీని ట్యాగ్ చేసిందంటే ఆమె ఈ ఇష్యూని ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది. Also Read: ఇకపోతే పాయల్ ఆరోపణల నేపథ్యంలో ఆమెకు ఓ పార్టీ అండగా నిలబడిన విషయం తెలిసిందే. ముంబైలోని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆమెను తమ పార్టీ లోకి ఆహ్వానించి.. ఆ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించారు. పాయల్ సినిమాల విషయానికొస్తే అప్పట్లో తెలుగులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'ప్రయాణం' సినిమాలో, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో నటించిన పాయల్ ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U1yvbX

No comments:

Post a Comment

Apple's UI executive poached by Meta, and three other executives leave in Apple AI exodus

The number of Apple execs leaving the company continues to rise, but most are being replaced. from Latest from TechRadar https://ift.tt/dB...