Friday, December 27, 2019

బికినీల్లో హాట్ హాట్‌గా రాజశేఖర్ కూతుళ్లు

2019కి గుడ్‌బై 2020కి హార్టీ వెల్‌కం చెప్పే సమయం వచ్చేసింది. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో ఈపాటికి దేశమంతా ప్లానింగ్స్ వేసేసి ఉంటారు. సాధారణ ప్రజలైతే ఎక్కడైనా వేడుకలు జరుపుకుంటారు. కానీ సెలబ్రిటీలకు అది వీలుపడదు. అందుకే విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ పనులను కాస్త పక్కనబెట్టి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి విదేశాలకు పయనమయ్యారు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మికలు న్యూ ఇయర్ సందర్భంగా చిల్ అవుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడి మరీనా బే సాండ్స్ రిసార్ట్స్‌లో బిల్డింగ్‌పై కట్టిన స్విమ్మింగ్ పూల్‌లో శివానీ, శివాత్మికలు బికినీలు వేసుకుని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ ఫొటోలను శివానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. ఇక ఇతర సెలబ్రిటీల విషయానికొస్తే శుక్రవారం సూపర్‌స్టా్ర్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ చేయడానికి న్యూయార్క్ వెళ్లారు. మరోపక్క సమంత గోవాకు వెళ్లిపోయారు. READ ALSO: ఇక శివానీ, శివాత్మికల విషయానికొస్తే.. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు. పెద్ద కూతురైన శివాని తమిళంలో ‘2 స్టేట్స్’ అనే సినిమాలో నటించింది. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘2 స్టేట్స్’ సినిమాకు ఇది రీమేక్. ఇందులో అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. అయితే సినిమా అంతా అయిపోయింది అనుకున్న సమయంలో నిర్మాణ విషయంలో ఏవో విభేదాలు వచ్చాయి. దాంతో సినిమాను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోపక్క శివాత్మిక ఈ ఏడాదిలో ‘దొరసాని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అయినా దొరసాని పాత్రలో శివాత్మిక ఒదిగిపోయారు. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2t8PxKS

No comments:

Post a Comment