Wednesday, June 24, 2020

వినూత్న ఆలోచన చేసిన తమన్నా.. డీల్ సెట్!! ఇకపై అక్కడ కూడా అమ్మడి హవా..

హీరోలతో పోల్చితే హీరోయిన్స్ కెరీర్ గ్రాఫ్ కాస్త తక్కువగానే ఉంటుందనేది ఒప్పుకోవాల్సిన నిజం. నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది హీరోహీరోయిన్ల విషయంలో ఇది నిరూపించబడింది కూడా. అయినప్పటికీ కొందరు హీరోయిన్స్ మాత్రం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ కొత్త తరహా ఆలోచనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమా ఛాన్సులతో పాటు స్పెషల్ సాంగ్స్ చేయడానికీ రెడీ అంటున్న మిల్కీ బ్యూటీ .. తాజాగా టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఓ డీల్ సెట్ చేసుకుందని తెలిసింది. రానురాను డిజిటల్ మాధ్యమానికి, ఓటీటీ వేదికలకు ఆదరణ పెరుగుతుండటం గమనించిన తమ్మూ.. డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిందట. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ‘’ అనే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీని తెలుగు వారికి చేరువ చేయడంపైనే ఆయన స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసమై ప‌లువురు ద‌ర్శ‌కులు, కంటెంట్ రైట‌ర్స్‌ను రంగంలోకి దించడమే గాక, కొందరు హీరోయిన్స్‌తో పలు వెబ్ సిరీస్‌లు కూడా డీల్ చేస్తున్నారు. Also Read: ఈ నేపథ్యంలోనే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ తమన్నాకు ఓ ఆఫర్ ఇచ్చారట 'ఆహా' మేనేజ్‌మెంట్ వారు. ఆహా వేదికగా నడవనున్న ఓ టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్ ఇస్తూ ఆమె కోరుకున్న మేర రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. దీంతో ఈ డీల్ ఓకే చేసుకున్న తమన్నా, త్వరలోనే ఈ షోతో రంగంలోకి దిగనుందని తెలుస్తోంది. ఇకపోతే ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి హోరెత్తించిన తమన్నా.. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ‘సీటీమార్’ సినిమాలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని అతిత్వరలో ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fWk8yt

No comments:

Post a Comment