Wednesday, July 29, 2020

షాకింగ్: మరో యువ నటుడు ఆత్మహత్య.. ఇండస్ట్రీని వెంటాడుతున్న విషాదాలు

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాద వార్త వినిపిస్తుండటం సినీ ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ మరణాలతో పాటు నటుల ఆత్మహత్యలు యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతున్నాయి. ఇటీవలే యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడటంతో ఉలిక్కిపడ్డ సినీ లోకం.. ఇంతలోనే మరో యువ నటుడి ఆత్మహత్య చూడాల్సి వచ్చింది. మరాఠీ నటుడు (32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహారాష్ట్ర నాందెడ్‌లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అశుతోష్ భక్రే. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే ఆయన ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అశుతోష్ భక్రే సన్నిహితులు భావిస్తున్నారు. ఈ యువ నటుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు అనుమానాస్పద మృతి కింద దర్యాప్తు చేపడుతున్నారు. అశుతోష్ భక్రే ''భకార్, ఇచర్ థార్లా'' లాంటి మరాఠీ సినిమాల్లో నటించి ఫేమ్ అయ్యారు. ఆయన భార్య మయూరి దేశ్ ముఖ్ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. ‘ఖుల్తా కాళీ ఖులేనా’ అనే సీరియల్ ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fboLUG

No comments:

Post a Comment

Want a first look at Christopher Nolan’s The Odyssey? There's currently only one place to see the trailer

The Odyssey has a confirmed release date of July 17, 2026 The date was confirmed in a new poster No trailer has been officially release...