లెజెండరీ సింగర్ మరణం యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలో నెట్టేసింది. బాలు ఇకలేరనే మాటను ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్దాల కాలం పాటు కొన్ని వేల పాటలు పాడిన ఆ గొంతు మూగబోయిందనే విషయం తెలిసి సినీ ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు కంటతడి పెడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంతటా బాలు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది సంగీత ప్రపంచం. ఈ క్రమంలోనే బాలు ప్రాణ మిత్రుడు సంగీత దిగ్గజం ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాలూ నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని చెప్పాను.. కానీ నా మాట వినకుండా వెళ్లిపోయావు. నా నోటివెంట మాట రావడం లేదంటూ ఆవేదన చెందారు ఇళయరాజా. ''ఎక్కడికి వెళ్లావు? ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? ఇక ప్రపంచంలో నేను దేన్నీ చూడలేను. ఎంతటి దుఃఖానికైనా ఓ హద్దు ఉంటుంది.. కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు'' అంటూ కంటతడి పెట్టుకున్నారు ఇళయరాజా. Also Read: బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. బాలుతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ రోజు (శనివారం) బాలు అంత్యక్రియలు రెడ్హిల్స్లోని ఆయన ఫామ్హౌస్లో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FRVWB3
No comments:
Post a Comment