లాక్డౌన్ సమయంలోనే తన ప్రేమకు ప్రమోషన్ దక్కించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. మే 14వ తేదీన తన బంధు మిత్రుల సమక్షంలో పురోహితులు నిర్ణయించిన ముహూర్తం ఉదయం 06 గంటల 31 నిమిషాలకు అగ్ని సాక్షిగా తన ప్రేయసి మెడలో మూడుముళ్ళేసి ఏడడుగులు నడిచాడు. ఇక గత మూడు నెలలుగా ఆమెతో జాలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న తాజాగా పల్లవిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Also Read: నిన్న (సెప్టెంబర్ 3) తన సతీమణి పల్లవి వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ స్పెషల్గా విష్ చేశాడు నిఖిల్. ''హ్యాపీ బర్త్ డే వైఫీ.. నువ్వెప్పుడైతే నా లైఫ్ లోకి ఎంటరయ్యావో.. అప్పటి నుంచి అంతా ఆనందమయంగానే ఉంది'' అంటూ నిఖిల్ తన భార్యపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టాడు. పల్లవి తనతో ఎంతో అణకువగా మెదులుతోందని, ఆమె వచ్చాక జీవితం మరింత హాయిగా మారిందని పేర్కొన్నాడు. ప్రేమలో మునిగితేలి పెళ్లి బంధంతో ఒక్కటైన నిఖిల్- పల్లవి జోడీ ప్రస్తుతం ఈ లాక్డౌన్ విరామ సమయాన్ని జాలీగా గడుపుతోంది. ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. చివరగా 'అర్జున్ సురవరం' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో వరుస ప్రాజెక్ట్లతో బిజీ కానున్నాడు. కార్తికేయ 2తో పాటు 18 పేజెస్ సినిమాలతో మరోసారి ప్రేక్షకులను ముందుకు రాబోతున్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/355AoLs
No comments:
Post a Comment