'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత రెండేళ్ల పాటు రాజకీయ ప్రయాణం చేసి తిరిగి కెమెరా ముందుకొచ్చారు . నిర్మాతలకు కోరిక మేరకు వరుస సినిమాలను లైన్లో పెట్టేశారు. ఓ వైపు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూనే సినిమా షూటింగ్స్ త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా రీ ఎంట్రీలో ఫస్ట్ మూవీ 'వకీల్ సాబ్' చిత్రాన్ని వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. కాగా తాజా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకొచ్చింది. బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ 'పింక్' చిత్రానికి రీమేక్గా వేణు శ్రీరామ్ దర్శత్వంలో ఈ 'వకీల్ సాబ్' మూవీ రూపొందుతోంది. చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా ఫినిష్ అయింది. అయితే ఇందులో ఈ ముగ్గురితో పాటు మరో హీరోయిన్కి స్కోప్ ఉండటంతో నాలుగో హీరోయిన్ వేట కొనసాగుతోంది. Also Read: ఈ క్రమంలోనే వకీల్ సాబ్తో రొమాన్స్ చేయబోయే నాలుగో బ్యూటీగా శృతి హాసన్, ఇలియానా, జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ స్థానాన్ని దక్కించుకుందని తెలిసింది. ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని, భారీ ఆఫర్ పైగా పవన్ సినిమా కావడంతో తమన్నా వెంటనే రెడీ అనేసిందని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే లాయర్ గెటప్లో పవన్ కళ్యాణ్ కోర్టులో వాదిస్తున్న స్టిల్ ఒకటి లీక్ అయింది. దీంతో దర్శకనిర్మాతల నుంచి చిత్రయూనిట్ మొత్తానికి వార్నింగ్ వెళ్లిందని సమాచారం. ఏదిఏమైనా మరోసారి పవన్ని వెండితెరపై చూడాలని కుతూహలంగా ఉంది ప్రేక్షకలోకం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NPyGUp
No comments:
Post a Comment