బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో దర్యాప్తులో బాలీవుడ్లో డగ్స్ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది బాలీవుడ్ స్టార్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించారు. అనంతరం డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ... ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ సరఫరాదారులు, విక్రేతలు, వినియోగదారులకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది.
ఈ క్రమంలోనే పలు హిందీ సీరియళ్లలో నటించిన అనే బుల్లితెర నటి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఎన్సీబీకి చిక్కింది. ‘సంవాదన్ ఇండియా’, ‘దేవో కె దేవ్ మహదేవ్’ వంటి సీరియళ్లలో నటించిన ప్రీతికా కొన్నాళ్లుగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె వ్యవహారంపై నిఘా పెట్టిన ఎన్సీబీ అధికారులు సివిల్ డ్రెస్సుల్లో నిఘా పెట్టారు. ఫైజల్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ ఆమె డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రీతికా నుంచి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను కిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37GjzrF
No comments:
Post a Comment